Aha కంపెనీకి న‌రేష్ మాజీ భార్య నోటీసులు

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్ (naresh) మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి (ramya raghupathi).. Aha సంస్థ‌కు నోటీసులు పంపారు. న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ (pavitra lokesh) న‌టించిన మ‌ళ్లీ పెళ్లి (malli pelli) సినిమా ఓటీటీ రైట్స్ ఆహా కొనుగోలు చేసింది. గ‌తంలో సినిమా రిలీజ్ అవ్వ‌కుండా ఆపాల‌ని ర‌మ్య కూక‌ట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ వేసారు. కానీ ఆ పిటిష‌న్‌ను క్యాన్సిల్ చేసారు. సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌ను త‌ప్పుగా చూపించార‌ని ర‌మ్య ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. సినిమా ఎటూ రిలీజ్ అయిపోయింది కాబ‌ట్టి.. క‌నీసం ఆహాలోనైనా స్ట్రీమ్ అవ్వ‌కుండా చూడాల‌ని ర‌మ్య ఆహా సంస్థ‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి దీనిపై ఆహా ఏమంటుందో వేచి చూడాలి. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన మ‌ళ్లీ పెళ్లి సినిమాలో న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని చూపించారు. ఇందులో ర‌మ్య ర‌ఘుప‌తి క్యారెక్ట‌ర్‌లో త‌మిళ న‌టి వ‌నితా విజ‌య్ కుమార్ న‌టించారు.