Vyooham: అప్పుడు జ‌గ‌న్ ఎవ‌రో కూడా తెలీదు

దివంగ‌త నేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి (ys rajasekhar reddy) చ‌నిపోవడానికి ముందు వ‌ర‌కు అస‌లు వైఎస్ జ‌గ‌న్ (ys jagan) ఎవ‌రో కూడా త‌న‌కు తెలీద‌ని అన్నారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ (ram gopal varma). జ‌గ‌న్ పొలిటిక‌ల్ జర్నీని ప్రేక్ష‌కులకు చూపించేందుకు ఆయ‌న వ్యూహం (vyooham) అనే సినిమా తీసారు. న‌వంబ‌ర్ 10న సినిమా రిలీజ్ అవనుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు.

ఇందులో జ‌గ‌న్‌తో పాటు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సోనియా గాంధీల పాత్ర‌ల‌ను కూడా చూపించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయాక ఎప్పుడైతే జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టారో అప్పుడే జ‌గ‌న్‌ను అబ్స‌ర్వ్ చేయ‌డం మొద‌లుపెట్టాన‌ని అన్నారు. సినిమాలో ఎవ్వ‌రినీ నెగిటివ్‌గా కానీ పాజిటివ్‌గా కానీ చూపించ‌లేద‌ని.. ప్ర‌జ‌లకు తెలీని తెర‌వెనుక జ‌రిగిన విష‌యాల‌ను మాత్ర‌మే ఇందులో చూపించాన‌ని అన్నారు. ఈ సినిమాకు ఏపీ ఎన్నిక‌ల‌కు ఏమ‌న్నా సంబంధం ఉందా అంటే అది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. (vyooham)