NTR​ ఫంక్షన్​కి గెస్ట్​గా సూపర్​స్టార్​ రజినీ కాంత్​!

Hyderabad: నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(NT Rama Rao)  శత జయంతి ఉత్సవాలకు సూపర్​ స్టార్​ రజినీ కాంత్(Rajini Kanth)​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. T.D జనార్దన్ ఆధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదిన విజయవాడలో పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఈ ఉత్సవాలను ఘనంగా నిత్వహించనున్నట్లుగా ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ట(Balakrishna) తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరు కానున్నారని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ తో కలిసి నటించిన సీనియర్ నటులు, సినీ రాజకీయ నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో  పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ నందమూరి అభిమానులకు, తెలుగు దేశం పార్టీ(TDP) కార్యకర్తలందరికీ ఇదే ఆహ్వానముగా భావించి ఎన్టీఆర్​ శతజయంతి వేడుకలకు తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరారు.