నెల రోజుల వ్య‌వ‌ధిలోనే రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట మ‌రో విషాదం

rajendra prasad daughter dies of heart attack

Rajendra Prasad: సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న కూతురు గాయ‌త్రి నిన్న రాత్రి గుండెపోటుతో మ‌ర‌ణించారు. నిన్న రాత్రి ఆమె ఛాతిలో నొప్పి ఉంద‌న‌డంతో వెంట‌నే ఏఐజి హాస్పిట‌ల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె తెల్ల‌వారుజామున చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. రాజేంద్ర ప్ర‌సాద్‌కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆయ‌న‌కు గాయ‌త్రి అంటే చిన్న‌ప్ప‌టి నుంచి అమిత‌మైన ప్రేమ‌. ప‌దేళ్ల వ‌య‌సులోనే త‌న త‌ల్లి చనిపోతే త‌న కూతురిలోనే త‌ల్లిని చూసుకుంటూ బ‌తికాన‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు. కానీ త‌న కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో ఆమెతో మాట‌ల్లేవ‌ని చెప్పారు. రాజేంద్ర ప్ర‌సాద్ సోద‌రుడు చ‌నిపోయిన నెల రోజుల్లోనే ఆయ‌న కూతురు చ‌నిపోవ‌డం బాధాక‌రం. రాజేంద్ర ప్ర‌సాద్ సోద‌రుడు వీర‌భ‌ద్ర‌స్వామి గ‌త నెల‌లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంటికి చేరుకుని ఆయ‌న్ను ప‌రామ‌ర్శిస్తున్నారు.