PS2: వంద కోట్ల క్లబ్​లో..!

Hyderabad: కోలీవుడ్ స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం(Mani Ratnam) రూపొందించిన హిస్టారికల్​ మూవీ పొన్నియన్​ సెల్వన్(Ponniyan Selvan)​. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్​గా తాజాగా పొన్నియన్​సెల్వన్​2(PS2) రిలీజ్​ అయ్యింది. ఏప్రిల్​ 28న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మణిరత్నం డైరెక్షన్​లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటీనటులైన చియాన్​ విక్రమ్​(Vikram), జయం రవి(Jayam Ravi), కార్తీ(Karthi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan)​, త్రిష(Trisha), శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ మొదలైన వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకి ఆస్కార్​ విన్నర్​  ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఈ సినిమా ఏప్రిల్​ 28న రిలీజ్ కాగా పార్ట్ 1 తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ హిట్​ టాక్​ రావడంతో రెండో రోజు  భారీ కలెక్షన్లు రాబట్టింది. దీనితో ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ సోషల్​ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. పొన్నియన్​ సెల్వన్​ మొదటి భాగం సుమారు 600 కోట్లకి పైగా రాబట్టింది. మరి రెండో భాగం ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి మరి!