Project K: అదిరిపోయే అప్​డేట్​.. వీడియో వైరల్​!

బాహుబలితో పాన్​ఇండియా స్టార్​గా ఎదిగారు యంగ్​ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్​ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్​ రాముడిగా బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్​ రూపొందిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా జూన్​లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు సలార్, ప్రాజెక్ట్ K, మారుతి సినిమాలు వరుసగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో సలార్, ప్రాజెక్ట్ K సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ డిస్కషన్ జరుగుతుంది. చిత్రయూనిట్ ఆ రైడర్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. రైడర్స్ మేకింగ్ వీడియోని చూపించారు. గ్రాఫిక్స్ లో రైడర్స్ అనే వాళ్ళని ఎలా తయారు చేశారు, షూటింగ్ ఎలా చేస్తున్నారు అని చూపించారు. దీంతో ఈ వీడియో చూశాక రైడ్ఫర్స్ ఈ సినిమాలో విలన్స్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. కొంతమంది ప్రభాస్ తరపున ఉండే సైన్యం అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాలో ఈ రైడర్స్ అనే వాళ్ళు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ వీడియో, గతంలోకి కొన్ని పోస్టర్స్ చూశాక ఇది ఓ యుద్ధానికి సంబంధించిన కథ అని అర్ధమవుతుంది. ప్రాజెక్ట్ K నుంచి ఏ అప్​డేట్​ వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్​ ఈ వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రాజెక్ట్ K సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్​. రాధేశ్యామ్​తో నిరాశపరిచిన డార్లింగ్​ నుంచి ఈ ఏడాది వరుస సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే.