EXCLUSIVE: మ‌హేష్ బాబు కూర్చుని ఏడ‌వాలా ఏంటి?

EXCLUSIVE: గుంటూరు కారం (guntur kaaram) నిర్మాత నాగ వంశీ (naga vamshi) మీడియా వ‌ర్గాల‌పై.. కొంద‌రు త‌ప్పుడు రివ్యూలు రాసిన వారిపై మండిప‌డ్డారు. గుంటూరు కారంలో అస‌లు ఎమోష‌న్స్ లేవు అని రాసిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఎమోష‌న్స్ లేవు అంటే మ‌హేష్ బాబు (mahesh babu) సినిమా అంతా కూర్చుని ఏడ‌వాలా ఏంటి అని విమ‌ర్శించారు. స‌లార్ సినిమాకు మిడ్ నైట్ షోలు వేసిన‌ట్లు గుంటూరు కారంకు వేయాల‌నుకున్నామ‌ని కానీ అలా చేసినందుకు రిగ్రెట్ అవుతున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు గుంటూరు కారంకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో ఎలాంటి ఫేక్ వార్త‌లు లేవ‌ని క‌లెక్ష‌న్లు ఫేక్ అని ప్రూఫ్‌ల‌తో నిరూపిస్తే మీడియా ముందు అంద‌రికీ సారీ చెప్తాన‌ని నాగ వంశీ అన్నారు.