Ajith మంచివాడు కాదు.. మోసం చేసాడు

Hyderabad: న‌టుడు అజిత్ కుమార్ (ajith) మంచివాడు కాద‌ని త‌న‌ను మోసం చేసాడ‌ని త‌మిళ ప్రొడ్యూస‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసారు. అజిత్ త్వ‌ర‌లో మ‌గిళ్ తిరుమేణి అనే సినిమాలో న‌టించ‌బోతున్నారు. అయితే త‌మిళ నిర్మాత‌ మాణిఖ్యం నారాయ‌ణ్  (manickam narayanan) ఉన్నట్టుండి మీడియా ముందుకు వ‌చ్చి అజిత్ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం త‌న నుంచి డ‌బ్బు తీసుకున్నాడ‌ని ఇంకా తిరిగి ఇవ్వ‌లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇంత‌కీ డ‌బ్బులు ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. త‌న త‌ల్లిదండ్రుల‌ను మ‌లేషియా ట్రిప్‌కు తీసుకెళ్ల‌డానికి డ‌బ్బులు అడిగార‌ని అన్నారు. కోలీవుడ్‌లో త‌లాగా పేరుతెచ్చుకున్న అజిత్ (ajith) ట్రిప్ కోసం నిర్మాత నుంచి డ‌బ్బులు ఎందుకు అడుగుతారు అనేది ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే డ‌బ్బులు తిరిగివ్వ‌లేను కానీ సినిమా చేస్తాన‌ని అజిత్ మాణిఖ్యంతో అన్నార‌ట‌. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అజిత్ (ajith) తీసుకున్న డ‌బ్బు తిరిగి ఇవ్వ‌క‌పోగా త‌న‌తో ఒక్క సినిమా కూడా చేయ‌లేద‌ని ఆరోపిస్తున్నారు.

ఇన్నేళ్ల‌లో క‌నీసం త‌న‌తో మాట్లాడ‌లేద‌ని, త‌న‌ని తాను జెంటిల్‌మెన్‌గా చెప్పుకుంటాడు కానీ అత‌ను ఒక చీట‌ర్ అని మండిప‌డుతున్నారు. కానీ అజిత్ (ajith) భార్య షాలిని (shalini) చాలా మంచి వ్య‌క్తి అని చెప్పారు. అజిత్ ప్ర‌తి సినిమాకు రూ.50 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ని అలాంట‌ప్పుడు ఇత‌రుల‌ను మోసం చేయాల్సిన అవ‌సరం త‌నకి ఏముంది అని మాణిఖ్యం ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు త‌న డ‌బ్బు తిరిగి ఇచ్చే స్థోమ‌త అజిత్‌కి ఉన్నా కూడా ఇవ్వ‌డంలేద‌ని, గ‌తంలో అజిత్‌తో సినిమాలు చేసిన నిర్మాత‌లు న‌ష్ట‌పోయినా కూడా వారిని ఆదుకోలేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. మ‌రి దీనిపై అజిత్ ఏమ‌ని స్పందిస్తారో వేచి చూడాలి.