Prakash Raj: శివ‌య్యా….. మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్

prakash raj tweet on manchu vishnu

Prakash Raj: విల‌క్షణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్.. మా అధ్య‌క్షుడు మంచు విష్ణుపై వెక్కిరిస్తున్న‌ట్లు షాకింగ్ కామెంట్ చేసారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై ప్ర‌కాష్ రాజ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఈ విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. అలా కాకుండా ఈ విష‌యాన్ని జాతీయ స్థాయిలో లేవ‌నెత్తి మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల‌కు ఎందుకు దారితీస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దేశంలో అస‌లే మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. ఇప్పుడు తిరుమ‌ల ల‌డ్డూ విష‌యాన్ని పెద్ద‌ది చేయాల్సిన అవ‌సరం లేద‌ని అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై మంచు విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. “” ప్ర‌కాష్ రాజ్ గారూ.. మీకు కాస్త మౌనంగా ఉంటే బాగుంటుంది. తిరుమ‌ల ల‌డ్డూ అనేది కేవలం ప్ర‌సాదం కాదు… హిందువుల న‌మ్మ‌కం. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ‌కు ఆదేశించారు. మీరు మ‌తప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల గురించి లేవనెత్తారు కాబట్టి.. అవి నిజంగా ఎక్క‌డైతే జ‌రుగుతున్నాయో వాటిపై పోరాడండి “” అన్నారు. దీనికి ప్ర‌కాష్ రాజ్ రిప్లై ఇస్తూ… “”ఓకే శివ‌య్యా……. నీ అభిప్రాయం నీది. నా అభిప్రాయం నాది“” అని ఎగ‌తాళి చేసారు. విష్ణు న‌టిస్తున్న క‌న్న‌ప్ప సినిమాలో ఆయ‌న శివ‌య్యా అని అరిచే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఇప్పుడు ట్రోల్స్‌కి మీమ్స్‌కి వాడుతున్నారు.