Prakash Raj: నా కొడుకు మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌పోతున్నా

Prakash Raj says he cannot forget his deceased son

Prakash Raj: విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్.. ఇప్ప‌టికీ త‌న కుమారుడు సిద్ధార్థ్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని అన్నారు. ABP స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో ప్ర‌కాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న కుమారుడిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్ర‌కాష్ రాజ్ త‌న మొద‌టి భార్య ల‌లితా కుమారితో ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్నారు. వారిలో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, ఒక మ‌గ‌పిల్లాడు ఉన్నారు. బాబు సిద్ధార్థ్ యాక్సిడెంట్‌లో చిన్న వయ‌సులోనే చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత 2004లో ప్ర‌కాష్ రాజ్ త‌న భార్య ల‌లిత‌కు విడాకులు ఇచ్చేసి పోనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థ్‌ని వేదాంత్‌లో చూసుకుంటున్నాన‌ని అన్నారు. త‌న‌కు కూతుళ్లు ఉన్నార‌ని.. వారికి మంచి భ‌విష్య‌త్తు ఇవ్వాలి అన్న ఒకే ఒక్క కార‌ణం త‌న‌ను మాన‌సికంగా దృఢంగా ఉంచుతోంద‌ని… చావు అనేది త‌ప్ప‌దు అన్న‌ప్పుడు క‌నీసం ఈ క్ష‌ణాన ఆనందంగా ఉన్నామా లేదా అనేదే త‌న‌కు ముఖ్యం అని తెలిపారు.