నందినీ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్​ సినిమా!

Hyderabad: బాహుబలి(Bahubali) సినిమా తో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగిన ప్రభాస్(Prabhas)​ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్​ నటించిన ఆదిపురుష్​(Adipurush) విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut)​ రూపొందించిన ఈ సినిమా జూన్​ 16న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఇక, ఈ సినిమాతోపాటు సలార్(Salaar)​, ప్రాజెక్ట్ కె(Project K) తోపాటు మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న రాజా డీలక్స్​లో నటిస్తున్నారు ప్రభాస్​. ఇక తాజాగా నందినీ రెడ్డి(Nandini Reddy) కూడా ప్రభాస్​తో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్​గా మారిన నందనీ రెడ్డి చక్కని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నందిని రూపొందించిన తాజా చిత్రం‘అన్నీ మంచి శకునములే’(Anni Manchi Sakunamule). సంతోష్​ శోభన్(Santhosh Shoban)​, మాళవికా నాయర్​ జంటగా నటించిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా నందిని ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనే నమ్మకం ఉంది, అంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కోసం నా దగ్గర డార్లింగ్ రేంజ్ లవ్ స్టోరీ సిద్ధం గా ఉందని , ఒక్కసారి ప్రభాస్ ఛాన్స్ ఇస్తే కలిసి కథ చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి నందిని రెడ్డి, ప్రభాస్​ కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి!