Prabhas: అబ్బా సాయిరాం..నో చెప్పాడు..!

Hyderabad: మొత్తానికి ఇంట్రోవ‌ర్ట్ డార్లింగ్ ప్ర‌భాస్ (prabhas) కాస్త డేరింగ్ చేసి ఆ రోత బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌కు నో చెప్పేసారు. ఆదిపురుష్ (adipurush) రామాయ‌ణం అంటూ ఎన్నో ఆశ‌లు రేపి చివ‌రికి తెలుగువారితోనూ ప్ర‌భాస్‌ను (prabhas) తిట్టించిన ఘ‌నత బాలీవుడ్‌ది. కేవ‌లం వారి వ‌ల్లే ఇప్పుడు సెన్సార్ బోర్డు పురాణాల‌కు సంబంధించిన ఏ సినిమాల‌కు స‌ర్టిఫికేట్లు ఇవ్వాల‌న్నా ఆదిపురుష్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకునే పరిస్థితి ఏర్ప‌డింది.

ఇప్పుడు ప్ర‌భాస్‌కి అర్థ‌మైపోయింది. ఫీల‌వుతారేమోన‌ని భావించి ఎవ‌రికి ప‌డితే వారికి ఛాన్సులు ఇవ్వ‌కూడ‌ద‌ని తెలుసుకున్నారు. అందుకే ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ మంచి క‌థ చెప్తా అన‌గానే వెంట‌నే నో చెప్పేసారట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే సిద్ధార్థ్ ఆనంద్ (siddharth anand). నిజానికి సిద్ధార్థ్ ఆనంద్, ప్ర‌భాస్‌ల (prabhas) సినిమా ఎప్పుడో ఓకే అయిపోయింది. దీనిని మైత్రి మూవీ మేక‌ర్స్ (mythri movie makers) ప్రొడ్యూస్ చేయాల‌నుకుంది. ఇందుకోసం ప్ర‌భాస్‌కు రూ.60 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ కూడా ఇచ్చింది. కానీ ప్ర‌భాస్ ఇప్పుడు కేవ‌లం సౌత్ సినిమాల‌పైనే ఫోక‌స్ చేయాల‌నుకుంటున్నారు. అందుకే ఆ సినిమాకు నో చెప్పేసి ఆ డ‌బ్బును కూడా రిట‌ర్న్ చేసేసిన‌ట్లు టాక్.