Adipurush Trailer: ప్రాణాలకంటే మర్యాదనే అతి ప్రియమైనది!

HYderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ప్రముఖ ఇతిహాసం రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్​ 16న రిలీజ్​ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్(Saif Ali Khan)​ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎన్ని వివాదాల బారిన పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు (మే 9న) ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్​ చేయనుండగా మే 8నే ఏఎంబి మాల్​ (AMB mall) లో స్పెషల్ స్క్రీనింగ్ వేసిన విషయం తెల్సిందే. ఈ ట్రైలర్ స్క్రీనింగ్ కోసం ఏకంగా ప్రభాస్​, కృతిసనన్​తో సహా చిత్రబృందం మొత్తం వచ్చేసింది.

కాగా, టీజర్​తో విమర్శల పాలైన ఈ సినిమా ట్రైలర్ టాక్ మాత్రం అదిరిపోతోంది. 3డీ లో ట్రైలర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు ఫ్యాన్స్. మూడు నిమిషాలకన్నా పైనే ట్రైలర్ ను కట్ చేశారు. సీతను రావణాసురుడు కిడ్నాప్ చేయడంతో మొదలైన ట్రైలర్.. రావణాసురుడును రాముడు అంతం చేయడంతో ముగుస్తుంది. రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని చూపించారు. ‘ప్రాణాల కన్నా మర్యాదనే ప్రియమైనదా ..?’ అని లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకు.. ‘నాకు ప్రాణాలకన్నా మర్యాదనే అధిక ప్రియమైనది’ అని రాముడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. శబరి వద్ద రాముడు పళ్ళు తినడం, ఆంజనేయుడు.. సంజీవిని పర్వతాన్ని ఎత్తడం లాంటి సీన్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో అభిమానులను మెప్పించాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ట్రైలర్ అనంతరం అందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఏఎంబి దద్దరిల్లిపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్​ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మరి!