Aditi Rao Hydari: ఆమె వల్లే మా ఫోటోలు బ‌య‌ట‌పెట్టాల్సి వ‌చ్చింది

Aditi Rao Hydari: అదితి రావు హైద‌రి.. న‌టుడు సిద్ధార్థ్‌లు (Siddharth) త్వ‌ర‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వీరిద్ద‌రూ వ‌న‌ప‌ర్తిలోని 400 ఏళ్ల పురాత‌న‌మైన ఆల‌యంలో నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే త‌మకు నిశ్చితార్ధం అయిన విష‌యాన్ని కానీ త‌మ ఫోటోల‌ను కానీ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయాల‌ని అనుకోలేద‌ని.. కానీ త‌న తల్లి వ‌ల్ల ఫోటో రిలీజ్ చేసామ‌ని తెలిపారు అదితి.

“” అస‌లు మా నిశ్చితార్ధం విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచాల‌ని అనుకున్నాం. కానీ నిశ్చితార్ధం అయింద‌ని బ‌య‌టికి టాక్ రాగానే మా అమ్మ‌కు వేలాది ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. దాంతో పాపం ఆమె భ‌రించ‌లేక ప్లీజ్ బ‌య‌టికి చెప్పేయండి.. ఈ ఫోన్ కాల్స్ నేను త‌ట్టుకోలేను అని ఆవేద‌న చెందింది. అందుకే ఫోటోను రిలీజ్ చేసాం  అని తెలిపారు అదితి.

2021లో వ‌చ్చిన మ‌హాస‌ముద్రం సినిమా షూటింగ్ స‌మ‌యంలో సిద్ధార్థ్‌, అదితి ప్రేమించుకున్నారు. ఈ సినిమాలో వీరిద్ద‌రూ ప్రేమికులుగా న‌టించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసే క‌నిపిస్తుండ‌డంతో డేటింగ్‌లో ఉన్నార‌ని క‌న్ఫామ్ అయ్యింది. అయితే పెళ్లి ఎప్పుడు అనే వివ‌రాల‌ను మాత్రం అదితి వెల్ల‌డించ‌లేదు.