Pooja Hegde: కారు కొనిచ్చి అప్పుడు మాట్లాడండి

Mumbai:వరుస హిట్లతో టాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా ఎదిగిన బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde). టాలీవుడ్​తోపాటు బాలీవుడ్(Bollywood)​లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది పూజ. కాగా, పూజ ప్రస్తుతం సల్మాన్​ ఖాన్(Salman Khan)​తో కలిసి నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్​’(Kisi Ka Bhai Kisi ka Jaan) ప్రమోషన్స్​తో బిజీగా ఉంది. ఈ సినిమా ఈద్​ కానుకగా ఏప్రిల్​ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇక, ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో విక్టరీ వెంకటేష్(Venkatesh)​ కూడా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఏంటమ్మా.. పాటలో రామ్​ చరణ్(Ram Charan)​ కూడా చిందులేసి ప్రేక్షకులను అలరించారు.

కాగా, సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజ తనపై వస్తున్న రూమర్స్​పై స్పందించింది. భజరంగీ భాయిజాన్​ సీక్వెల్​లో తను సల్మాన్​ సరసన నటిస్తున్నానని వస్తున్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘అసలు ఇలా ఎలా మాట్లాడతారు. నామీద చాలా పుకార్లు వస్తున్నాయి. వాటిని ఎవరు క్రియేట్​ చేస్తున్నారో తెలియదు. నేను వాటన్నింటికీ సమాధానం చెబుతూ ఉండలేను’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘నా గురించి ఎంతలా పుకార్లు వస్తున్నాయో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్యనే నేను ఒక విచిత్రమైన వార్త విన్నా. అదేంటంటే… కిసీ కా భాయ్​ కిసీ కా జాన్​ షూటింగ్​లో నాకు సౌకర్యంగా ఉండటం కోసం ఖరీదైన కారు కొన్నారట. ఇలాంటివి వింటుంటే.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మాట్లాడేవాళ్లు నాకు కారు కొనిచ్చైనా మాట్లాడండి’ అంటూ చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

ఇక పూజ ప్రస్తుతం మహేష్(Mahesh Babu)​, త్రివిక్రమ్(Trivikram)​ కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB28లో హీరోయిన్​గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్​తో కాస్త నిరాశపడిన పూజ ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది.