Bro: మార్క్ చ్చేస్తున్నాడు!

Hyderabad: పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కలిసి నటించిన చిత్రం బ్రో: ది అవతార్​(Bro: The avatar). తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా రూపొందుతోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పవన్​ కల్యాణ్​ పార్ట్​ షూటింగ్​ పూర్తి చేసిన చిత్రబృందం పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. జూలై 28న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్​ను ఇటీవలే విడుదల చేశారు. ఈ మోషన్​ పోస్టర్​తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఈ మోషన్​ పోస్టర్​లో టైటిల్ అండ్ పవన్ లుక్ పై ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. టైటిల్​ రిలీజ్​తో సెన్సేషన్​ క్రియేట్​ చేసిన మేకర్స్​ మరో అప్​డేట్​ అందించారు. ఈ సినిమాలో బ్రో స్నేహితుడైన మార్క్ ని రేపు సాయంత్రం 4:14 నిమిషాలకు పరిచయం చేస్తామంటూ ప్రకటించారు. మార్క్ అంటే ఈ సినిమాలో సాయి ధరమ్ క్యారెక్టర్ పేరు అని తెలుస్తుంది. మరి రేపు ఇచ్చే అప్డేట్ తో ఎటువంటి అంచనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే బ్రో టైటిల్​ పోస్టర్​ యూట్యూబ్​లో రికార్డులు క్రియేట్​ చేస్తోంది. మార్క్​ క్యారెక్టర్​ రివీల్​తో ఎలాంటి సెన్సేషన్​ క్రియేట్​ చేస్తారో చూడాలి మరి.