Pawan Kalyan: “రోజా” తీసింది ఆయ‌న కాదు BRO!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan), సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) యాక్ట్ చేసిన బ్రో (bro) సినిమా ఫ్రైడే గ్రాండ్‌గా రిలీజ్ అవ్వ‌బోతోంది. నిన్న శిల్ప‌క‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటుచేసారు. అయితే ఈవెంట్‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. ఈవెంట్‌కి వ‌చ్చిన గెస్ట్‌ల‌లో ఏ.ఎం ర‌త్నం (am ratnam) ఒక‌రు. ఈయ‌న హ‌రి హ‌ర వీర మ‌ల్లు (hari hara veera mallu) సినిమాకి ప్రొడ్యూస‌ర్. అయితే ప‌వ‌న్ ఆయ‌న గురించి మాట్లాడుతూ.. ఏ.ఎం ర‌త్నం రోజా సినిమా తీసారు అనేసారు. నిజానికి రోజా సినిమా తీసింది ఏ.ఎం ర‌త్నం కాదు మ‌ణిర‌త్నం (maniratnam). ఇద్ద‌రి పేర్ల‌లో ర‌త్నం ఉండ‌టంతో ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్ అయ్యారు.