Yatra 2: భ‌య‌ప‌డుతున్న ఓటీటీ సంస్థ‌లు

Yatra 2: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం యాత్ర 2. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేయ‌నున్నారు. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తీసుకునేందుకు ఏ ఓటీటీ సంస్థ‌లు కూడా ముందుకు రావ‌డంలేదు. ఎక్క‌డ ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొనుక్కుంటే ఎక్క‌డ ఎవ‌రి నుంచి బెదిరింపులు వ‌స్తాయో అని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. మ‌రోప‌క్క థియేట‌ర్‌లో రిలీజ్ అవుతోంద‌న్న అంశంపై కూడా ఎలాంటి టాక్ కానీ క్రేజ్ కానీ లేదు.