Rashmika Mandanna: ఐశ్వ‌ర్య‌.. సంజాయిషీలు అక్క‌ర్లేదు!

Hyderabad: ర‌ష్మిక మంద‌న(rashmika mandanna) గురించి ఐశ్వ‌ర్య రాజేష్(aishwarya rajesh) చేసిన వ్యాఖ్య‌లు దుమారానికి దారి తీయ‌డంతో ఆమె ట్విట‌ర్‌లో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఐశ్వ‌ర్య న‌టించిన ఫర్హానా సినిమా రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా ప్ర‌మోషన్స్ కోసం అని ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో టాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో శ్రీవ‌ల్లి క్యారెక్ట‌ర్ నాకు వ‌చ్చి ఉంటే ఎగిరి గంతేసేదాన్ని. శ్రీవ‌ల్లి క్యారెక్ట‌ర్‌కు నేను బాగా స‌రిపోతాను అని అన్నారు.

అయితే కొన్ని ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ మ‌రోలా అర్థంచేసుకుని.. శ్రీవ‌ల్లి క్యారెక్ట‌ర్‌ను ర‌ష్మిక కంటే నేనే బాగా చేసుండేదాన్ని అని రాసేసాయి. దాంతో ఐశ్వ‌ర్య ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. త‌ప్పుగా అర్థంచేసుకుని గొడ‌వ‌లు క్రియేట్ చేయొద్ద‌ని రిక్వెస్ట్ చేసారు. దీనిపై ర‌ష్మిక స్పందించారు. “హాయ్ ల‌వ్.. నీ ప్రెస్‌నోట్ చూసాను. నువ్వు ఏమన్నావో నాకు బాగా అర్థ‌మైంది. మ‌నం ఎవ్వ‌రికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నేను నీ వ‌ర్క్‌ను చాలా ఇష్ట‌ప‌డ‌తాను. ఫర్హానా సినిమాకు ఆల్ ది బెస్ట్” అంటూ త‌న మంచి మ‌నసును చాటుకుంది రష్మిక‌.