Natti Kumar: నా స‌పోర్ట్ TDP, జ‌న‌సేన‌కే.. ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ను

ఎవ‌రు ఎంత బెదిరించినా బెదిరేది లేద‌ని త‌న మ‌ద్దతు ఎప్పుడూ TDP, జ‌న‌సేన‌కే అని అన్నారు ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టి కుమార్ (natti kumar) అయితే రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) తీసిన వ్యూహం (vyooham) సినిమాను రిలీజ్ కానివ్వ‌కుండా న‌ట్టి కుమార్ కోర్టులో కేసు వేసారు. దాంతో సినిమా సెన్సార్ జ‌ర‌గ‌నివ్వ‌కుండా ఆగిపోయింది. ఇందుకు కార‌ణం త‌న‌కు గ‌తంలో వ‌ర్మ ఇవ్వాల్సిన డ‌బ్బు ఇంకా బాకీ ఉంద‌ని అది ఇవ్వ‌కుండా ఆయ‌న వేరే సినిమాను ఎలా రిలీజ్ చేస్తార‌ని కోర్టులో కేసు వేసారు.

అయితే వ్యూహం సినిమాను ఆపుతున్నార‌ని YSRCP ప్ర‌భుత్వం త‌ర‌ఫు వారు ఎవ‌రో న‌ట్టి కుమార్‌కు ఫోన్ ఆస్తులు ఎక్క‌డున్నాయి అని ఫోన్లు చేసి అడుగుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో న‌ట్టి కుమార్ ప్రెస్ ముందుకు వ‌చ్చి త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. ఈ నాలుగేళ్ల‌లో త‌న ఆస్తుల గురించి అడ‌గ‌లేద‌ని.. ఇప్పుడు వ్యూహం సినిమాను అడ్డుకున్నందుకు అడుగుతున్నారంటే ఇది క‌క్ష సాధింపు చ‌ర్యేన‌ని ఆరోపిస్తున్నారు. త‌న‌పై ఎన్ని కేసులు వేసినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగానే ఉన్నాన‌ని.. త‌న పోరాటం త‌న‌కు రావాల్సిన డ‌బ్బు గురించే కానీ ఎవ్వ‌రిపైనా వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు లేవ‌ని తెలిపారు.