Malli Pelli: కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో న‌రేష్ మాజీ భార్య‌ పిటిష‌న్

Hyderabad: సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ (vk naresh) మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి (ramya raghupathi) కూక‌ట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ వేసారు. న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ (pavitra lokesh) న‌టిస్తున్న మ‌ళ్లీ పెళ్లి (malli pelli) సినిమాను నిలిపివేయాలంటూ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌ను త‌ప్పుగా చూపించార‌ని ఆరోపించారు. ఈ సినిమా రేపు విడుద‌ల కాబోతోంది. విడుద‌లకు ఒక రోజు ముందే ర‌మ్య ర‌ఘుప‌తి (ramya raghupathi) కోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజై చాలా రోజులు అవుతోంది. అప్పటివ‌ర‌కు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోని ర‌మ్య.. స‌రిగ్గా సినిమా రిలీజ్‌కు ఒక‌రోజు ముందు పిటిష‌న్ వేయ‌డం ప‌ర్స‌న‌ల్ ఎటాక్‌లా అనిపిస్తోంది. దీనిపై న‌రేష్ కానీ పవిత్ర లోకేష్ కానీ స్పందించ‌లేదు. మ‌రోప‌క్క ఈ సినిమాకు (malli pelli) త‌న నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేద‌ని ఇప్ప‌టికే న‌రేష్ చాలాసార్లు స్ప‌ష్టం చేసారు. సినిమా చూసాక ఆ విష‌యం ఆడియ‌న్స్ కూడా అర్థం అవుతుంద‌ని అన్నారు. ఎం.ఎస్ రాజు (ms raju) సినిమాను డైరెక్ట్ చేసారు. అన‌న్య నాగ‌ళ్ల‌ (ananya nagalla), అన్న‌పూర్ణ‌, శ‌ర‌త్ బాబు (sarath babu) కీ రోల్స్ ప్లే చేసారు.