‘కాంతార’ రేంజ్​లో ‘నరకాసుర’!

Hyderabad: పలాస(Palaasa) ఫేమ్ రక్షిత్(Rakshith) హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శనివారం విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీపై టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాలో సంగీర్తన(Sangeerthana), అపర్ణ(Aparna) హీరోయిన్లుగా నటిస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఇంత గొప్ప అవుట్ ఫుట్ వస్తుందని నేను ఎప్పుడు నమ్మలేదు. దీని కోసం ఏంటో బాధను భరించాం. త్యాగాలు చేసాం. బట్ ఈ రియాక్షన్ చూసాక అంటా మర్చిపోయాం. ఈ జర్నీ మొత్తంలో ఆర్టిస్టుల సపోర్ట్ మరువలేను. హీరో రక్షిత్ సపోర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చాల టఫ్ గా ఉన్నా వాతావరణంలో పని చేసాడు. స్క్రిప్ట్ కు తగ్గట్టుగా రకరకాలుగా కనిపించేందు రెండున్నరేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు. ఖచ్చింతంగా ఈ మూవీతో సక్సెస్ అందుకుంటాం. ఈ సందర్బంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను” అన్నారు. ఇక సినిమాటోగ్రాఫర్​ సెంథిల్​ కుమార్(K. K. Senthil Kumar)​ మాట్లాడుతూ ‘నరకాసుర’ టీజర్ ‘కాంతార’ రేంజ్‌లో ఉందన్నారు.

‘నేను పర్సనల్ గా సినిమాటోగ్రాఫర్ అయినందుకు ముఖ్యంగా తెలుగు సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా అని చూపొచ్చు. బాహుబలినుంచి మొదలై ఇప్పుడు పాన్ ఇండియా ను కూడా దాటాం. ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత కాంతారా రేంజ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు కల్చరల్ బేస్ ఉన్నకథలకు మంచి ఆదరణ ఉంది. ఎవరినో మెప్పించాలి అని కాకుండా స్క్రిప్ట్ కు తగ్గట్టుగా పాత్రలూ, లొకేషన్స్ కరెక్ట్ గా ఎంచుకుని చేయాలి. ఈ మూవీ పెద్ద విజ్జయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.