Nagarjuna: చై స‌మంతపై కొండా సురేఖ వ్యాఖ్య‌లు.. నాగార్జున మండిపాటు

nagarjuna slams konda surekha

Nagarjuna: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల అక్కినేని నాగార్జున మండిప‌డ్డారు. భార‌త రాష్ట్ర స‌మితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వ‌ల్ల నాగ‌చైత‌న్య స‌మంత విడిపోయార‌ని.. కేటీఆర్ వారి ఫోన్ ట్యాపింగ్‌ల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. దాంతో పెద్ద ఎత్తున ఇది ర‌చ్చ‌కు దారి తీసింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే జీవితాల‌ను ప్ర‌త్య‌ర్ధుల‌ను విమ‌ర్శించేందుకు వాడుకోవ‌ద్ద‌ని అన్నారు. సాటి మ‌నుషుల వ్య‌క్తిగ‌త జీవితాల‌ను గౌర‌వించాల‌ని.. బాధ్య‌త గ‌త ప‌ద‌విలో ఉన్న ఓ మ‌హిళా మంత్రి మ‌రో మ‌హిళ ప‌ట్ల ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌ని.. ఆ వ్యాఖ్య‌ల‌న్నీ అవాస్త‌వాలే అని నాగార్జున అన్నారు. వెంట‌నే ఈ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు.