OTT ని న‌మ్ముకున్న ఏకైక తెలుగు హీరో..!

ఇప్పుడున్న తెలుగు హీరోలు నేరుగా థియేట‌ర్ల‌లోనే త‌మ సినిమాల స‌త్తాను చాటుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇక OTT గురించి ఎక్కువ‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. కానీ టాలీవుడ్ నుంచి ఓటీటీని న‌మ్ముకున్న ఏకైక తెలుగు హీరో ఎవ‌రైనా ఉన్నారంటే అది నాగ‌చైత‌న్య (Naga Chaitanya) అనే చెప్పాలి. నాగచైత‌న్య న‌టించిన థ్యాంక్యూ, క‌స్ట‌డీ సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్స్ అయ్యాయి. వీటికి ఓటీటీలోనూ ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అలాంటి స‌మ‌యంలో నాగ చైత‌న్య ధూత (Dhootha) అనే వెబ్ సిరీస్‌ను న‌మ్ముకున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లలో ధూత నెంబ‌ర్ 1 పొజిష‌న్‌ను ద‌క్కించుకుంది.

అందుకే ఇప్పుడు ధూత‌కు పార్ట్ 2 తీస్తున్నారు. పార్ట్ 1 బాగా హిట్ అయ్యింది కాబ‌ట్టి ఇక పార్ట్ 2పై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. పార్ట్ 1కి విక్ర‌మ్ కే కుమార్ దర్శ‌క‌త్వం వ‌హించారు. పార్ట్ 2 కూడా ఆయ‌నే తీస్తే మంచి విజ‌యం సాధిస్తుంది. అప్పుడు నాగ చైత‌న్య కెరీర్ మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డుతుంది. ఇక ప్ర‌స్తుతానికైతే నాగ‌చైత‌న్య తండేల్ (Thandel) సినిమాలో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) న‌టిస్తోంది. మ‌ళ్లీ వీరిద్ద‌రూ ల‌వ్‌స్టోరీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేలా ఉన్నార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.