వార‌సుడులో నా క్యారెక్ట‌ర్ లేపేసారు

Hyderabad: వార‌సుడు(vaarasudu) సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ మొత్తం లేపేసారని తెలిపారు న‌టి ఖుష్బూ సుంద‌ర్(khushbu sundar). మ్యాచో స్టార్ గోపీచంద్(gopichand) హీరోగా తెర‌కెక్కిన రామ‌బాణం(ramabanam) సినిమాలో ఖుష్బూ కీ రోల్‌లో న‌టించారు. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా ఖుష్బూ మాట్లాడారు. వార‌సుడులో త‌న‌ది 18 నిమిషాల క్యారెక్ట‌ర్ అని.. ర‌న్నింగ్ టైం ఎక్కువ ఉండ‌టంతో మొత్తం క‌ట్ చేసార‌ని తెలిపారు. నిర్మాత దిల్ రాజు నా క్యారెక్ట‌ర్ కోసం ఎక్కువ డ‌బ్బు పెట్టిన‌ప్ప‌టికీ అది వృథా అయింద‌ని అన్నారు. ఇక‌పోతే.. త‌న సినీ కెరీర్‌లో ఓ లోటు ఉండిపోయింద‌ని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి న‌టించే అవ‌కాశం రాలేద‌ని, వ‌స్తే త‌ప్ప‌కుండా యాక్ట్ చేస్తాన‌ని తెలిపారు. త‌న‌కు ఇష్ట‌మైన యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ అని, ఇప్ప‌టికీ ఆయ‌న‌కు సంబంధించిన పోస్ట‌ర్లు ఇంట్లో భ‌ద్రంగా దాచుకున్నాన‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు ఖుష్బూ.