Adipurush: మొత్తం టీంని సజీవ‌ద‌హ‌నం చేయాలి

Hyderabad: ఆదిపురుష్ (adipurush) టీం మొత్తాన్ని స‌జీవ‌ద‌హ‌నం చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ప్ర‌ముఖ హిందీ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా (mukesh khanna). ఓం రౌత్ (om raut) డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ సినిమాపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే. హ‌నుమంతుడి డైలాగులు, చీప్ వీఎఫ్ఎక్స్, రావ‌ణాసురుడి క్యారెక్ట‌ర్ డిజైన్‌, ప్ర‌భాస్ (prabhas) లుక్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆదిపురుష్ (adipurush) ట్రోల్ అవుతోంది. మ‌రోప‌క్క క‌లెక్ష‌న్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే ఎంద‌రో సెల‌బ్రిటీలు సినిమాను త‌ప్పుబ‌డుతున్నారు. వెంట‌నే బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు ఓకే కానీ ముఖేష్ ఖ‌న్నా చేసిన కామెంట్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. టీం మొత్తాన్ని 50 డిగ్రీల మంట‌ల్లో స‌జీవ‌ద‌హ‌నం చేయాల‌ని అన్నారు.

“మ‌నోజ్ ముంతాషిర్ (manoj muntashir) సినిమాకు డైలాగులు రాసార‌ని తెలిసింది. ఆయ‌న గొప్ప రైట‌ర్ అని చాలా సార్లు విన్నా కానీ ఎప్పుడూ ఆయ‌న రాసిన డైలాగులు విన‌లేదు. కానీ ఆదిపురుష్‌లో ఆయ‌న రాసిన డైలాగులు విన్నాక నాకు చాలా బాధేసింది. పైగా చిన్న పిల్లాడిలాగా ఆయ‌న ఇస్తున్న ఎక్స్‌ప్ల‌నేషన్ చూస్తుంటే న‌వ్వు వ‌స్తోంది. చిన్న‌ప్ప‌టి నుంచి పిల్ల‌లు చూస్తున్న రామాయ‌ణాన్ని మ‌ర్చిపోయి ఈయ‌న రాసిన డైలాగుల‌తో రామాయ‌ణం చూపించాల‌ని అనుకుంటున్నాడా?” అంటూ మండిప‌డ్డారు ముఖేష్‌.