Mohan Babu: నాకు సెక్యూరిటీ స‌రిపోదు.. !

Mohan Babu: అయోధ్య రామ‌మందిరంలో నిన్న జ‌రిగిన ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి మంచు మోహ‌న్ బాబు కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఆహ్వానం అందింది. మంచు ఫ్యామిలీ నుంచి మంచు మ‌నోజ్‌ (manchu manoj), ఆయ‌న స‌తీమ‌ణి మౌనిక రెడ్డి (bhuma mounika reddy) ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించేందుకు వెళ్లారు. కానీ మోహ‌న్ బాబు మాత్రం వెళ్ల‌లేదు. ఎందుకు వెళ్ల‌లేదు అనే అంశంపై స్పందిస్తూ.. తాను అయోధ్య‌కు వ‌స్తే సెక్యూరిటీ స‌రిపోద‌ని.. అందుకే ఇబ్బంది క‌లిగించ‌డం ఎందుకు అని రాలేద‌ని అన్నారు. సీఎంలు, పీఎంల క‌న్నా నువ్వేమ‌న్నా ఎక్కువ అనుకుంటున్నావా అంటూ నెటిజ‌న్లు ఒక ఆడుకుంటున్నారు. ఈయ‌న ఎప్ప‌టికి మార‌తాడో ఏంటో..!