Mogalirekulu న‌టుడు ప‌విత్ర‌నాథ్ మృతి

Mogalirekulu: బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన మొగ‌లిరేకులు సీరియ‌ల్ ఫేం ప‌విత్ర‌నాథ్ (pavitranath) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. మొగ‌లిరేకులు సీరియ‌ల్‌లో ద‌య క్యారెక్ట‌ర్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చక్ర‌వారం, మొగ‌లిరేకులు సీరియ‌ల్‌లో ఇంద్ర సోద‌రుడు ద‌య పాత్ర‌లో పవిత్ర‌నాథ్ న‌టించారు. ప్ర‌ముఖ న‌టుడు ఇంద్ర‌నీల్ భార్య మేఘ‌న ఈ చేదు వార్త‌ను రివీల్ చేసారు. ప‌వి.. ఈ బాధ‌ను మేం వ‌ర్ణించ‌లేక‌పోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్య‌మైన‌వాడివి. మేం ఈ వార్త విన్నాక ఇది నిజం కాద‌ని కాకూడ‌ద‌ని కోరుకున్నాం. ఇది అబ‌ద్ధం అయితే బాగుండ‌ని ఆశించాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని తెలిసి త‌ట్టుకోలేక‌పోతున్నాం. క‌నీసం నిన్ను ఆఖ‌రి చూపు కూడా చూసుకోలేక‌పోయాం. నిన్ను చాలా మిస్స‌వుతాం. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాలని ఈ స‌మ‌యంలో నీ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల‌ని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నా అని పేర్కొన్నారు.

అయితే ప‌విత్ర‌నాథ్ ఎలా చ‌నిపోయారు అనే విష‌యం తెలియ‌రాలేదు. గ‌తంలో ప‌విత్ర‌నాథ్ భార్య ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అత‌నికి అమ్మాయిల పిచ్చి ఉంద‌ని తాను ఇంట్లో ఉండ‌గానే అమ్మాయిల‌ను తెచ్చుకుని ఎంజాయ్ చేసేవాడ‌ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. అప్పుడ‌ప్పుడూ త‌న‌పై చెయ్యి కూడా చేసుకునేవాడ‌ని పేర్కొంది. అయితే ప‌విత్ర‌నాథ్‌ది ఆత్మ‌హ‌త్యా లేక స‌హ‌జ మ‌ర‌ణ‌మా అనేది తెలియాల్సి ఉంది.