Mansoor: చిరంజీవి నాకు స‌పోర్ట్ చేయ‌కుండా త్రిష‌కు ఎలా చేస్తారు?

Mansoor Ali Khan: త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్.. న‌టి త్రిష‌ల (trisha) మ‌ధ్య నెల‌కొన్న వివాదానికి ఇక తెర‌ప‌డిన‌ట్లే అని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌ళ్లీ మ‌న్సూర్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్రిష‌, చిరంజీవి, ఖుష్బూల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు కార‌ణం త‌న గురించి త‌ప్పుగా సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేసార‌ని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం త్రిష‌తో ఇప్ప‌టివ‌ర‌కు రేప్ సీన్ల‌లో నటించ‌లేద‌ని త్వ‌ర‌లో ఆ కోరిక నెర‌వేరుతుంద‌ని అనుకుంటున్నాన‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన మ‌న్సూర్‌పై త్రిష మండిప‌డ్డారు. ఇలాంటి వారి వ‌ల్లే మ‌గ‌జాతికి మచ్చ వ‌స్తుంద‌ని అన్నారు. ఆ త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్, చిరంజీవి, ఖుష్బూ, నితిన్ త‌దిత‌రులు త్రిష‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్స్ చేసారు. మ‌న్సూర్ లాంటి వ్య‌క్తిపై కేసు వేయాల్సిందేన‌ని అన్నారు.

ఈ వివాదంలో త‌న‌కు మ‌ద్ద‌తు తెలిప‌కుండా త్రిష‌కు స‌పోర్ట్ చేసార‌ని అందుకే వారిపై కేసులు వేస్తాన‌ని పిచ్చిగా వాగుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం మ‌న్సూర్ త‌న వ్యాఖ్య‌లు త‌ప్పే అని తెలుసుకుని త్రిష‌కు సారీ చెప్పారు. ఆ త‌ర్వాత త్రిష కూడా క్ష‌మిస్తున్న‌ట్లు ట్వీట్ చేసారు. కానీ మ‌న్సూర్ ఆరిపోయిన వివాదాన్ని మ‌ళ్లీ ఆజ్యం పోసి లేపుతున్నారు.