Manjummel Boys ద‌ర్శ‌కుడిపై న‌టి లైంగిక ఆరోప‌ణ‌లు

Manjummel Boys: మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ ద‌ర్శ‌కుడు చిదంబ‌రంపై (Chidambaram) న‌టి ప్రాప్తి ఎలిజ‌బెత్ (Prapti Elizabeth) షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు. చిదంబ‌రం త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోపించారు. మ‌ల‌యాళం ప‌రిశ్ర‌మ‌లో ఇంకెన్నాళ్లు అబ్బాయిల‌కు సంబంధించిన సినిమాలే తీస్తార‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్ర‌శ్నించారు. మంజుమ్మెల్ గ‌ర్ల్స్ గురించి సినిమా తీస్తే ఎన్నో అంశాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని అన్నారు.

మంజుమ్మెల్ బాయ్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్య‌క్తి పోస్ట్ పెట్టారు. సినిమా చూసానని చాలా బాగుంద‌ని.. మంజుమ్మెల్ గ‌ర్ల్స్ అని తీస్తే కూడా ఇంకా బాగుంటుంద‌ని తెలిపారు. ఈ పోస్ట్ కింద ప్రాప్తి ఓ కామెంట్ పెట్టారు. ఇక నేను ద‌ర్శ‌కుడి గురించి.. మ‌గ‌వారి స్నేహాల గురించి చెప్పానంటే.. అని ఆ కామెంట్ పెట్టారు. చిదంబ‌రం తీసిన తొలి సినిమా జానేమ‌న్‌లో ప్రాప్తి న‌టించారు. ఈ సినిమా స‌మ‌యంలోనే త‌న‌కు చిదంబ‌రం నుంచి లైంగిక వేధింపులు ఎదురైన‌ట్లు వెల్ల‌డించారు. అయితే ప్రాప్తి కామెంట్ చూసిన ఓ వ్య‌క్తి స్పందిస్తూ.. అస‌లు కృత‌జ్ఞ‌తాభావ‌మే లేద‌నుకుంటా అన్నాడు. దీనికి ప్రాప్తి స‌మాధానం ఇస్తూ..దేనికి కృత‌జ్ఞ‌తాభావం. నేను తీసుకున్న డ‌బ్బుల‌కా? లేక ఎదుర్కొన్న లైంగిక వేధింపుల‌కా అని స‌మాధానం ఇచ్చారు.

ఇక మంజుమ్మెల్ బాయ్స్ సినిమా గురించి చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్ అయిన మలయాళీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ నడుస్తుంది. కేవలం 10 కోట్లతో నిర్మిస్తే వంద కోట్ల క్లబ్‏లో చేరిన సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏంటీ అనుకుంటున్నారా ?.. అదే ‘మంజుమేల్ బాయ్స్’.

కేవలం పది కోట్లతో నిర్మిస్తే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలోని కామెడీ మరియు థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంజుమేల్ బాయ్స్ అనే యువకుల బృందం తమిళనాడులోని కొడైకెనాల్‌లోని ‘గుణ గుహలు’కి విహారయాత్రకు వెళ్లే కథతో ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ అభిమానులు అయిన ఆ యువకులు ‘గుణ’ షూటింగ్ జరిగిన ‘గుణ కేవ్స్’ వద్దకు వెళ్తారు. అదే సమయంలో తమ టీంలోని ఓ యువకుడు డెవిల్స్ కిచెన్‌లో పడిపోతాడు. దీంతో మిగతా సభ్యులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనేది మంజుమేల్ బాయ్స్ కథ. ఇందులో సోబిన్, శ్రీనాథ్ బస్సీ, బాలు, లాల్జీ తదితరులు నటించారు.

తమిళంలోనూ ఈ చిత్రాన్ని డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసి ప్రశంసలు కురిపించారు కమల్. అటు తమిళంలోనూ రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ చిత్రం. తమిళనాడులో రజనీకాంత్ ‘లాల్ సలామ్’ కలెక్షన్ల కంటే ‘మంజుమేల్ బాయ్స్’ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. (Manjummel Boys)

ఇకపోతే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ విడుదల తేదీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ మూవీ ని “ది బాయ్స్” అనే పేరు తో తెలుగు లో మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది … టాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ ఏ రేంజ్ లో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ది బాయ్స్ అనే టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందింది. ఈ మూవీ అంతా మంచి సస్పెన్స్ గా ముందుకు సాగినప్పటికీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఈ సినిమా స్వరూపాన్ని మార్చే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ 20 నిమిషాలతో ఈ సినిమా అదిరిపోయే స్థాయికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది.