Manchu Vishnu: ఈసారి కూడా గెలిచేది జ‌గ‌నే

Manchu Vishnu: త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) మ‌ళ్లీ గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డినే (Jagan Mohan Reddy) అని అన్నారు న‌టుడు మంచు విష్ణు. ఇది త‌న ప‌ర్స‌న‌ల్ అభిప్రాయం కాద‌ని.. చాలా మ‌టుకు స‌ర్వేలు అలాగే చెప్తున్నాయ‌ని అందుకే తాను కూడా ఆయ‌నే మ‌ళ్లీ గెలుస్తాడ‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

విష్ణు భార్య వెరోనికా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెల్లెలు అవుతుంది. వీరంతా ఒకటే కుటుంబం. అందుకే మంచు విష్ణు చాలా మ‌టుకు జ‌గ‌న్‌కే మ‌ద్దతు తెలుపుతున్నారు. గ‌తంలో వెరోనికా జ‌గన్ గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటే ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసారు. ఆ ట్రోల్స్‌పై స్పందించిన వెరోనికా.. జ‌గ‌న్ నా అన్న‌య్య‌. నేనెందుకు స‌పోర్ట్ చేయ‌కూడ‌దు అని మండిప‌డ్డారు.