Manchu Vishnu: ప్ర‌కాష్ రాజ్ చేత జై శ్రీరాం అనిపిస్తా

manchu vishnu says he will make prakash raj say jai sriram

Manchu Vishnu: తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో మంచు విష్ణుకి, ప్ర‌కాష్ రాజ్‌ల‌కి మ‌ధ్య ట్విట‌ర్ యుద్ధం జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌డ్డూ విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో ద‌ర్యాప్తు జ‌రిగేలా చూస్తానంటూ ట్వీట్ చేయ‌గా.. ప్ర‌కాష్ రాజ్ ఆ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. ఆల్రెడీ దేశంలో ఉన్న గొడ‌వ‌లు చాల‌ద‌న్న‌ట్లు ఎందుకు మ‌త‌క‌ల్లోలాలు సృష్టిస్తున్నారు అని ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేసారు. తిరుమ‌ల లడ్డూ విష‌యంలో నిజంగా క‌ల్తీ జ‌రిగితే దానిపై విచార‌ణ చేయ‌కుండా ఎందుకింత హ‌డావుడి సృష్టిస్తున్నారు అని ప్ర‌శ్నించారు.

దీనికి మంచు విష్ణు స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ ఏం చేయాల‌నుకుంటున్నారో చెప్పార‌ని.. ద‌య‌చేసి ఈ విష‌యంలో నోరుమెద‌ప‌కుండా ఉంటే మంచిద‌ని మంచు విష్ణు అన్నారు. ఇక్క‌డితో ఈ గొడ‌వ ఆగ‌లేదు. ప్ర‌కాష్ రాజ్ మంచు విష్ణుకి స‌మాధానం ఇస్తూ.. శివ‌య్యా.. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది అని సెటైర్ వేసారు. దీనిపై మంచు విష్ణు స్పందించారు. ప్ర‌కాష్ రాజ్‌కి దేవుడిపై భ‌క్తి ఉందో లేదో నాకు తెలీదు కానీ.. క‌నీసం ఈ ర‌కంగానైనా ఆయ‌న నోటి నుంచి శివ‌య్యా అనే ప‌దాన్ని విన‌ప‌డేలా చేసాను. త్వ‌ర‌లో జై శ్రీరాం అని కూడా అనిపిస్తాను అని స‌మాధానమిచ్చారు.

ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌కాష్ రాజ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ప్ర‌స్తుతం తాను షూటింగ్‌లో ఉన్నాన‌ని.. ఈ నెల 30న ఇండియాకి వ‌స్తున్నాన‌ని వ‌చ్చాక ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తాన‌ని ప్ర‌కాష్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేసారు.