మౌనిక ఏడుస్తుంటే.. నేను బ‌తికి వేస్ట్ అనిపించింది

Hyderabad: సినీ న‌టుడు మంచు మ‌నోజ్‌(manchu manoj).. దివంగ‌త నేత భూమానాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికరెడ్డి(mounika reddy)ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లి మంచు కుటుంబంలోనే కాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో మంచు మ‌నోజ్.. త‌న భార్య మౌనికతో ఏర్ప‌డిన స్నేహం గురించి ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ఉప్పెన సినిమాలో “ఈశ్వ‌ర ప‌ర‌మేశ్వ‌ర” పాట‌లో హీరో హీరోయిన్లు కొన్ని నిమిషాలు మాత్ర‌మే వేరే వేరే ప్ర‌దేశాల్లో తిరిగార‌ని, కానీ తాము మాత్రం ఏడాది పాటు తిరగాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. “త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు మౌనిక బాధ‌లో ఆమె బిడ్డ‌ను ప‌ట్టుకుని ఏడుస్తుంటే నేను బ‌తికి కూడా వేస్ట్ అనిపించింది. మౌనిక మాత్ర‌మే కాదు.. ఆమె కొడుకు కూడా నా బాధ్య‌తే అనిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో ఎదుర్కొంటూ వ‌స్తున్నాం. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి” అని మ‌నోజ్(manoj) మ‌న‌సులో మాట చెప్పారు. అయితే కొన్ని రోజుల క్రితం అన్న మంచు విష్ణుతో(manchu vishnu) జ‌రిగిన గొడ‌వ గురించి మ‌నోజ్(manoj) స్పందించిన తీరుతో ఆయ‌న‌పై నెగిటివ్ రిమార్క్ ప‌డింది. ప‌లువురు జ‌ర్న‌లిస్ట్‌లు గొడ‌వ ఏంటి స‌ర్ అని అడిగితే.. “సంక‌లో గ‌డ్డ వ‌చ్చింది వ‌చ్చి గోకుతారా?” అని వెట‌కారంగా మాట్లాడ‌టంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.