Malayalam: డ్ర‌గ్స్ వాడ‌తారు.. సెట్స్‌కి లేట్‌గా వ‌స్తారు: నిర్మాత షాకింగ్ కామెంట్స్

Hyderabad: మ‌ల‌యాళం(malayalam) చిత్ర‌పరిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్(drugs) విచ్చ‌ల‌విడిగా వాడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు నిర్మాత సాండ్రా థామ‌స్(sandra thomas). ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించ‌క‌పోతే.. న‌టుల‌ను న‌మ్ముకున్న నిర్మాత‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సినీ న‌టుడు సెట్స్‌లోనే డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికే సెట్స్‌లో డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని తెలిసి న‌టులు షేన్ నిగ‌మ్, శ్రీనాథ్ బాషిల‌ను ఫెఫ్కా(ఫిలిం ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ కేర‌ళ‌) బ్యాన్ చేసింది.

“మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విచ్చ‌ల‌విడిగా డ్రగ్స్ వాడుతున్నార‌ని వంద శాతం నిజం. దీనిని వెంటనే కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. డ్ర‌గ్స్ తీసుకునేవారు రాత్రిళ్లు ప‌డుకోలేరు. దాంతో కొంద‌రు న‌టులు షూటింగ్‌ల‌కు లేట్‌గా వ‌స్తున్నారు. మేం చెప్పేవ‌న్నీ వింటారు కానీ పాటించ‌రు. షూటింగ్ టైం, డేట్లు మ‌ర్చిపోతుంటారు. చివ‌రికి నష్టపోయేది నిర్మాత‌లే” అని వాపోయారు సాండ్రా.