Mahesh Babu: ప్యాన్ ఇండియా సినిమా.. ప్రామిస్ చేసిన మ‌హేష్‌

Mahesh Babu: ఖ‌లేజా (khaleja) త‌ర్వాత గుంటూరు కారం (guntur kaaram) సినిమాతో మేజిక్ చేయాల‌నుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (trivikram srinivas). కానీ సినిమా వ‌సూళ్లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ టాక్ మాత్రం త్రివిక్ర‌మ్ మార్క్ అందుకోలేద‌నే చెప్పాలి. అయితే.. ఈ సినిమా చేస్తున్న స‌మ‌యంలోనే మ‌రో ప్యాన్ ఇండియా సినిమా త‌ప్ప‌కుండా చేద్దాం అని మ‌హేష్ త్రివిక్ర‌మ్‌కు ప్రామిస్ చేసార‌ట‌.

నిజానికి గుంటూరు కారం స్టోరీ ఫైన‌లైజ్ కాకముందే ఒక యాక్ష‌న్ సినిమా ప్లాన్ చేయాల‌నుకున్నారు త్రివిక్ర‌మ్. ఆల్మోస్ట్ గ్లింప్స్ కూడా రెడీ అయింది. అయితే అప్ప‌టికే రాజ‌మౌళితో అడ్వెంచ‌ర‌స్ ప్యాన్ ఇండియా సినిమా తీయాల‌ని ఫిక్స్ అయిన మ‌హేష్ ఈసారికి గుంటూరు కారంతో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తీసేయ్.. రాజ‌మౌళితో ప్యాన్ ఇండియ‌న్ సినిమా చేస్తున్నాను కాబ‌ట్టి.. మీతో మ‌రో ప్యాన్ ఇండియా సినిమా త‌ప్ప‌కుండా చేస్తా అని మాటిచ్చార‌ట‌. అలా గుంటూరు కారంకి శ్రీకారం చుట్టారు త్రివిక్ర‌మ్‌.