SSMB 28: మ‌హేష్‌కి ఈ టైటిల్ తెగ నచ్చేసింద‌ట‌!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) త్రివిక్ర‌మ్ (trivikram) కాంబినేష‌న్‌లో SSMB 28 వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 31న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో మ‌హేష్ మాస్ లుక్ ర‌చ్చపుట్టిస్తోంది. ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ఇది. అయితే సినిమాకు గుంటూరు కారం (guntur karam) అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో పాటు ఇంకొన్ని టైటిల్స్ కూడా ప‌రిశీలించారు కానీ మ‌హేష్‌కి గుంటూరు కారం టైటిల్ తెగ న‌చ్చేసింద‌ట‌. దాంతో దీనినే టైటిల్‌గా పెట్టాల‌ని గురూజీ ఫిక్స్ అయిన‌ట్లు టాలీవుడ్ టాక్‌. అస‌లైతే త్రివిక్ర‌మ్ నుంచి సినిమా వ‌స్తోంది అంటే ఆ సినిమా టైటిల్ తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే అది ఆయ‌న సెంటిమెంట్. అత‌డు, అఆ, అల‌వైకుంఠ‌పురం, అజ్నాత‌వాసి ఇలా అన్నీ లెట‌ర్‌తో స్టార్ట్ అయ్యే టైటిల్స్‌నే ఎంచుకుంటారు. మ‌రి ఈసారి సెంటిమెంట్‌ను ప‌క్క‌నబెట్టి ఎందుకు గుంటూరు కారం టైటిల్ అనుకుంటున్నారో గురూజీనే (trivikram) చెప్పాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే (pooja hegde) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. త‌మ‌న్ (thaman) మ్యూజిక్ ఇస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.