సంక్రాంతి బ‌రిలో ఉస్తాద్.. SSMB28.. ఓజీ!

Hyderabad: 2024 సంక్రాంతి (sankranthi) బ‌రిలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu), ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్, మ‌హేష్ కాంబినేష‌న్‌లో  SSMB28 సినిమా వ‌స్తోంది. ఇంకా టైటిల్ క‌న్ఫామ్ కాలేదు. ఇప్ప‌టికైతే గుంటూరు కారం టైటిల్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. మ‌రోప‌క్క హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (ustaad bhagat singh) సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ప్లాన్స్ వేస్తోంది. ఇంకోప‌క్క యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కూడా ప‌వ‌న్‌తో సినిమా OG చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ఒక నెల ముందు అంటే డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి రెండు ప‌వ‌న్ సినిమాలు రిలీజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంద‌ని నిర్మాణ సంస్థ‌లు ఆలోచిస్తున్నాయి. దాంతో ఏ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు నిర్మాత‌లు.

దాంతో ఉస్తాద్‌ను మార్చికి పోస్ట్‌పోన్ చేస్తారేమో అన్న రూమ‌ర్స్ కూడా వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క త్రివిక్ర‌మ్ ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఏ హీరో సినిమా రిలీజ్ డేట్‌తో అయినా క్లాష్ పెట్టుకుంటారు కానీ.. పవ‌న్ సినిమా రిలీజ్ ఉన్న‌ప్పుడు మాత్రం త‌న సినిమాను రిలీజ్ చేయ‌డానికి సాహ‌సం చేయ‌రు. దాంతో మ‌హేష్ సినిమాను కూడా పోస్ట్‌పోన్ చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి 2024 సంక్రాంతికి మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి పండ‌గనే చెప్పాలి.