Madhubala: హీరోల‌కి దూరంగా ఉండాల‌నుకున్నా

Hyderabad: బాలీవుడ్‌లోకి ఫూల్ ఔర్ కాంటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మ‌ధుబాల (madhubala) రోజా సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల్లో న‌టించారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రమే న‌టించి హీరోయిన్‌గా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసారు. సినిమాలు మానేసాక పెళ్లి చేసుకుని ఓ ఇంటివార‌య్యారు. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లైనా కూడా తోటి హీరో, హీరోయిన్ల‌తో ట‌చ్‌లో ఉంటూ ఉంటారు. కానీ మ‌ధుబాల మాత్రం అలా వ‌ద్ద‌నుకున్నార‌ట‌. అస‌లు ఎవ‌రితోనూ ట‌చ్‌లో ఉండ‌క‌పోవ‌డం మంచిది అని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నాన‌ని ఓ సంద‌ర్భంలో తెలిపారు.

ఇందుకు కార‌ణం ఏంటో చెప్ప‌లేదు కానీ ఆ నిర్ణ‌యం ఎంత త‌ప్పో త‌ర్వాత తెలిసి వ‌చ్చింద‌ని అన్నారు. ఆ త‌ర్వాత బాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు క‌రిష్మా క‌పూర్, శిల్పా శెట్టిల‌తో మ‌ళ్లీ ట‌చ్‌లోకి వ‌చ్చాన‌ని అన్నారు. ఇటీవ‌ల వారితో క‌లిసి పార్టీ చేసుకున్న‌ట్లు తెలిపారు. అయితే హీరోయిన్ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చాను కానీ హీరోల‌తో మాత్రం త‌న‌కు స‌రైన స‌త్సంబంధాలు లేవ‌ని, వారికి దూరంగానే ఉండాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇక సినిమాల విష‌యానికొస్తే.. ప‌లు తమిళ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ వ‌చ్చిన మ‌ధుబాల‌.. చాలా కాలం త‌ర్వాత శాకుంతలం సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె స‌మంత (samantha) త‌ల్లి పాత్ర‌ను పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అవ‌డంతో చాలా బాధ‌ప‌డిన‌ట్లు తెలిపారు.