కరాటే కల్యాణికి మంచు విష్ణు వార్నింగ్​.. షోకాజ్​ నోటీసులు!

Hyderabad: అనునిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే సెలబ్రిటీల్లో ఒకరు మా సభ్యురాలు, సినీనటి కరాటే కల్యాణి(Karate Kalyani). తాజాగా కల్యాణి ఏకంగా ఎన్టీఆర్(Nandamuri Taraka Ramarao)​పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చకు దారి తీసింది. దీంతో మా(MAA) అధ్యక్షుడైన మంచు విష్ణు క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారి చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో తారకరామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా కల్యాణి డిమాండ్​ చేశారు. దేవుడి రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని కల్యాణి తెలిపారు. తాజాగా ఈ వివాదంలో ఆమెకు ఊహించని షాక్ ఇస్తూ మా అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు పంపించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.