LGM: ధోని సినిమా వచ్చేస్తోంది.. !

Hyderabad: టీమిండియా మాజీ కెప్టెన్‌ మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోని(Mahendra singh Dhoni) కొద్ది కాలం కిందటే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన భార్య సాక్షి సింగ్​(Sakshi singh)తో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ (Dhoni Entertainment) అనే పేరు పెట్టారు. ఎంఎస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు.

ఈ సినిమా రమేష్ తమిళ్‌మణి(Ramesh Tamil Mani) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆయన రాసిన అథర్వ – ది ఆరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోనీ- తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని కోలీవుడ్ టాక్. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు.. లీడ్ క్యారెక్టర్లు చేస్తోన్నారు. ఈ సినిమాకి లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) పేరును ఖరారు చేశారు. దీని ఫస్ట్ లుక్​ని తాజాగా ఎంఎస్ ధోనీ ఆవిష్కరించారు.

ఈ వేసవిలో సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావొచ్చని తెలుస్తోంది.
2011 ప్రపంచ కప్, 2007 T20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో సహా అనేక ప్రతిష్టాత్మక విజయాలను భారత్‌కు అందించాడు ధోని. ఆయన కెప్టెన్సీలో భారత్ అత్యున్నత జట్టుగా రూపొందింది. ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. ఇక ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. ఇక ధోని బయోపిక్​గా ఎమ్​.ఎస్​.ధోని. ది అన్​టోల్డ్​ స్టోరీ(MS Dhoni: The untold story) వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్​సింగ్​ (Sushanth Singj Rajputh)రాజ్​పుత్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.