Lakshmi Manchu: 143 మందితో మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది.. చ‌ర‌ణ్‌, బ‌న్నీ కూడా ఉన్నారు.. మేం చేసేది ఇదే

Lakshmi Manchu reveals interesting details about whatsapp group

Lakshmi Manchu: త‌ను ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నార‌ని తెలిపారు న‌టి మంచు ల‌క్ష్మి. ఆ గ్రూప్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌తో పాటు మ‌రో 143 మంది న‌టీన‌టులు ఉన్నార‌ని అన్నారు. ఒక‌రి సినిమాల గురించి మ‌రొక‌రు స‌పోర్ట్ చేసుకోరు అని త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై మంచు ల‌క్ష్మి స్పందిస్తూ ఈ వాట్సాప్ గ్రూప్ గురించి బ‌య‌ట‌పెట్టారు. “” మేం ఒకరికొక‌రం స‌పోర్ట్ చేసుకోం అంటుంటారు. 143 మంది న‌టీన‌టులు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో నేనూ ఉన్నాను. ఏద‌న్నా సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ కానీ టీజ‌ర్ కానీ ట్రైల‌ర్ కానీ వ‌స్తే ఆ గ్రూప్‌లో పెడ‌తారు. దాంతో మేమంతా సోష‌ల్ మీడియాలో మా త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాం “” అని వెల్ల‌డించారు.