మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్​!

Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్​లో వచ్చిన ఆర్​ఆర్​ఆర్(RRR)​ సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​. హీరోగా రాణిస్తూనే బుల్లితెరపైనా పలు షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్​(Tarak) మరోసారి సరికొత్త టాక్​ షోతో రానున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ టాక్ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆహాలో అన్​స్టాపబుల్​ అంటూ అదరగొడుతున్న బాలయ్య తరహా కార్యక్రమాన్ని తారక్​తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై తారక్‌తో కలిసి మాట్లాడినట్టు సమాచారం.ఈ షో చేసేందుకు ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నాడంట. అనుకున్నవన్నీ జరిగితే నవంబంర్‌లోనే షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రానా హోస్ట్ చేసిన నెం.1 యారి త‌ర‌హాలో ఈ టాక్ షో ఉండ‌బోతుంద‌ట.

గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్‌ బాస్‌(Bigg boss) షోలతో ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేశారు. నిజంగా తారక్​ మరోసారి బుల్లితెరపై టాక్​ షో చేస్తే అభిమానులకు పండగే. ఎన్టీఆర్​ హోస్ట్​గా చేసిన బిగ్​బాస్​ మొదటి సీజన్ సూపర్​ హిట్​గా నిలిచింది. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్నా ఆ షోకి మళ్లీ అంత క్రేజ్​ రాలేదు. ఇక, ప్రస్తుతం తారక్​ కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది గ్యాప్​ తర్వాత ఎన్టీఆర్​ షూటింగ్​లో పాల్గొన్నారు. NTR30 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. ఆస్కార్​(Oscar) అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.