Jr NTR: స‌గం మంది ఓటెయ్య‌రా.. జ‌ర్న‌లిస్ట్‌ల‌తో తార‌క్ ముచ్చ‌ట్లు

Jr NTR:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఉద‌యాన్నే జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌కి త‌న భార్య ప్ర‌ణ‌తితో పాటు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. లైన్‌లో తార‌క్ నిల‌బ‌డి ఉండ‌టంతో రిపోర్ట‌ర్లు ఫోటోలు, వీడియోలు తీస్తూ అక్క‌డే ఉన్నారు. వారితో తార‌క్ స‌ర‌దాగా ముచ్చ‌టించారు.

మీరు ఓటెయ్య‌రా.. ఇక్క‌డే ఉంటారా అని తారక్ వారిని అడ‌గ్గా.. మీరు వేసాక మేం వెళ్లి వేస్తాం స‌ర్ అని బ‌దులిచ్చారు. ఆ త‌ర్వాత ఓ రిపోర్ట‌ర్.. స‌గం మంది వేస్తారు స‌గం మంది వేయ‌రు అని చెప్ప‌డంతో ఏంటి స‌గం మంది వెయ్య‌రా? అని తార‌క్ షాకింగ్‌గా అడిగారు.