వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్

jr ntr reaches high court in a land dispute

JR NTR: ఓ భూమి విష‌యంలో వివాదం త‌లెత్త‌డంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 75లో ఉన్న ఫ్లాట్ విష‌యంలో వివాదం నెల‌కొంది. 2003లో గీతాల‌క్ష్మి అనే మ‌హిళ నుంచి తార‌క్ ల్యాండ్ కొనుగోలు చేసారు. ఇదే స్థ‌లంపై 1996 నుంచి గీతాల‌క్ష్మి కుటుంబం ప‌లు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు. అయితే లోన్ తీసుకునే స‌మ‌యంలో గీతాల‌క్ష్మి న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ట‌. ఈ విష‌యాన్ని తార‌క్‌కు ల్యాండ్ అమ్మే స‌మ‌యంలో గీతాల‌క్ష్మి చెప్ప‌కుండా మోసం చేసింది. ఈ నేప‌థ్యంలో ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు రావ‌డంతో గీతాల‌క్ష్మి చేసిన మోసం బ‌య‌ట‌ప‌డింది. దాంతో తార‌క్ హైకోర్టును ఆశ్ర‌యించారు.