NTR: మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా!

Hyderabad: నేడు (మే 28) నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ(TDP) కార్యకర్తలు ఎన్టీఆర్​ ఘాట్(NTR ghat)​ వద్ద ఘనంగా నివాళి అర్పించారు. నందమూరి నట వారసుడు జూనియర్​ ఎన్టీఆర్(Jr NTR)​ కూడా ఉదయాన్నే ఎన్టీఆర్​ ఘాట్​ చేరుకుని సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి తాతకు నివాళులు అర్పించారు. తారక్​ రాకతో అభిమానుల తాకిడి మరింత ఎక్కువైంది. నందమూరి అభిమానులు తారక్‌ని చూడగానే ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జనం కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా ట్విట్టర్ లో ‘మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు తారక్. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్​ కొడుకు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తండ్రికి ఘన నివాళి అర్పించారు. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ కొడుకు నందమూరి రామకృష్ణ, కూతురు పురందేశ్వరితో పాటు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్, ఇతర ప్రముఖులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.