JR NTR: తెలుగు రాష్ట్రాల‌కు తార‌క్ ఆర్థిక సాయం

JR NTR donates to telangana and ap governments amid floods

JR NTR: భారీ వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ పూర్తిగా మునిగిపోయింది. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌వంతు విరాళం ప్ర‌క‌టించారు. “” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను “” అని ఎన్టీఆర్ వెల్ల‌డించారు.