Jr NTR: క‌లిసే ఆ నిర్ణ‌యం తీసుకున్నారా?

దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు (ntr) శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న ముద్ర‌ణ‌లో రూ.100 కాయిన్‌ను లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి నారా, నంద‌మూరి కుటుంబానికి సంబంధించిన ముఖ్య‌మైన వారంతా వచ్చారు కానీ ఆయ‌న మ‌న‌వ‌ళ్లు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (nkr), జూనియ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) మాత్రం రాలేదు. కొంద‌రేమో వారిని కావాల‌నే ఆహ్వానించ‌లేదు అంటున్నారు. మ‌రికొంద‌రు ఆహ్వానించినా షూటింగ్స్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల వెళ్ల‌లేదు అంటున్నారు.

అయితే.. తార‌క్, క‌ళ్యాణ్ రామ్ ఈవెంట్‌కు వెళ్ల‌కూడ‌దు అని ముందే నిర్ణయించుకోవ‌డం వ‌ల్ల వెళ్ల‌లేద‌ని కూడా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏ ఈవెంట్‌కు వెళ్లాల‌న్నా ముందే ఇద్ద‌రూ మాట్లాడుకుని మ‌రీ అటెండ్ అవ్వాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఒక‌వేళ తార‌క్ వెళ్లాల‌నుకుంటే క‌ళ్యాణ్ రామ్ కూడా వెళ్తార‌ని.. తార‌క్ వ‌ద్ద‌నుకుంటే మాత్రం క‌ళ్యాణ్ రామ్ ఆగిపోతార‌ని పేర్కొన్నాయి. ఇప్పుడు తాత‌గారి కాయిన్ లాంచ్ ప్రోగ్రామ్‌కి రాక‌పోవ‌డానికి కార‌ణం.. తార‌క్ దేవ‌ర షూటింగ్‌లో బిజీగా ఉండ‌ట‌మే. ఇక త‌మ్ముడు వెళ్ల‌ట్లేదు అని తెలిసి క‌ళ్యాణ్ రామ్ కూడా డ్రాప్ అయిపోయార‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. (jr ntr)