Rajinikanth నిజాలే మాట్లాడ‌తారు

Hyderabad: సూపర్‌స్టార్ ర‌జినీకాంత్(rajinikanth) ఏం మాట్లాడినా క‌రెక్ట్‌గానే మాట్లాడ‌తార‌ని అంటున్నారు విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు(jagapathi babu). కొన్ని రోజుల క్రితం ర‌జినీ.. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల కోసం కృష్ణా జిల్లాకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్కడ ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గురించి గొప్ప‌గా మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. దాంతో వైసీపీ నేత‌లు ర‌జినీపై నోటికొచ్చిన కామెంట్స్ చేసారు. ఇదే విష‌య‌మైన జ‌గ‌ప‌తిబాబు స్పందించారు. ఆయ‌న కీ రోల్‌లో న‌టించిన రామ‌బాణం సినిమా శుక్ర‌వారం రిలీజ్ అవ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ర‌జినీకాంత్‌పై YCP నేతలు చేసిన వ్యాఖ్య‌ల గురించి స్పందించారు. “ర‌జినీకాంత్ గారు 100% రైట్. ఈ విష‌యం అనే కాదు. ఆయ‌న ఏం మాట్లాడినా క‌రెక్ట్‌. చ‌క్క‌గా మాట్లాడ‌తారు, నిజాలు మాట్లాడ‌తారు. ఈ ఘ‌ట‌న గురించి అనే కాదు. ఆయ‌న ఎప్పుడూ అలాగే ఉంటారు” అని తెలిపారు.