మైత్రి మూవీ మేక‌ర్స్‌పై ఐటీ దాడులు

Hyderabad: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్(mythri movie makers) సంస్థ‌పై ఐటీ, ఈడీ దాడులు జ‌రుగుతున్నాయి. పుష్ప‌-2(pushpa 2) ప్ర‌మోష‌న్స్‌తో పాటు సంక్రాంతి స‌మ‌యంలో రిలీజ్ అయిన రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న నేప‌థ్యంలో ఈ దాడులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.  2015లో న‌వీన్ యేర్నేని, ర‌వి శంక‌ర్ ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ నుంచి రిలీజ్ అయిన మొద‌టి సినిమా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన శ్రీమంతుడు. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను నిర్మించారు. మొన్న జ‌న‌వ‌రిలో వ‌చ్చిన వీర‌సింహారెడ్డి(veera simha reddy), వాల్తేరు వీర‌య్య(waltair veerayya) సినిమాల‌ను కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించింది. ఖుషి, పుష్ప -2, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, ఎన్టీఆర్ 31, రామ్‌చ‌ర‌ణ్‌16వ సినిమాల‌ను మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. పెద్ద హీరోల‌తో సినిమాలు, పైగా అన్నీ ఒకేసారి షూటింగ్స్ జ‌రుగుతుండ‌డంతో ఐటీ, ఈడీ అధికారులు ఈ రైడ్లు చేప‌డుతున్న‌ట్లు టాక్.