చ‌నిపోయింది నా భ‌ర్త కాదు.. నేను సింగిల్

Hyderabad: త‌మిళం, తెలుగు సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు వ‌నిత విజ‌య్‌కుమార్‌(vanitha vijaykumar). ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్(naresh), ప‌విత్ర లోకేష్(pavitra lokesh) న‌టించిన మ‌ళ్లీ పెళ్లి సినిమాలో వ‌నిత కీ రోల్‌లో న‌టించారు. అయితే రెండు రోజుల క్రితం వ‌నిత ఓ ట్వీట్ పెట్టారు. త‌నకు తెలిసిన‌వారు ఎవ‌రో చ‌నిపోవ‌డంతో బాధ‌ప‌డుతూ ట్వీట్స్ చేసారు. “నువ్వు జీవితంలో ఎంతో అనుభవించి చివ‌రికి ప్ర‌శాంతంగా వెళ్లిపోయావు. చాలా బాధ‌గా ఉంది. నువ్వెక్క‌డున్నా సంతోషంగా ఉండాలి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఎవ‌రు చ‌నిపోయారు అన్న విష‌యం మాత్రం చెప్ప‌లేదు. దాంతో చాలా మంది చ‌నిపోయింది వ‌నిత భ‌ర్త అయివుంటార‌ని ట్వీట్స్ పెడుతున్నారు. దాంతో వ‌నిత వారంద‌రికీ స‌మాధానం ఇచ్చారు. “అస‌లు ఈ విష‌యం గురించి ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు అనుకున్నాను. కానీ చెప్పాల్సి వ‌స్తోంది. చ‌నిపోయింది పీట‌ర్ పౌల్ అనే వ్యక్తి. 2020లో నేను పీట‌ర్ ప్రేమించుకున్నాం. అదే సంవ‌త్స‌రంలో విడిపోయాం. అత‌ను నా భ‌ర్త కాదు. నేను ఇప్పుడు సింగిల్‌గానే ఉన్నాను. ద‌య‌చేసి నా భ‌ర్త పోయాడు అంటూ ప్ర‌చారం చేయ‌ద్దు అని వేడుకుంటున్నాను” అని తెలిపారు.